Weather Forecast : రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. ఈనెల 21 వరకు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసిం ది.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఒకటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది.
గత నెల రోజుల నుంచి ఎండలు మండిపోతు న్నాయి. పిల్లలు వృద్దులు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలా ఎండలు మండి పోతున్న తరుణంలో వాతావరణ శాఖ వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో ప్రజలు సంతోషా న్ని వ్యక్తం చేస్తున్నారు. అధిక వేడితో అల్లాడుతున్న ప్రజలకు వర్షాలు కురిస్తే వాతావరణం చల్లబడు తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.