![Chandrababu's key announcement..](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/08/maxresdefaulter4.jpg)
Chandrababu :
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పొత్తులపై ఆయన రెండు రోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు. ఇక మ్యానిఫెస్టో ప్రకటనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సంక్షేమం బేస్డ్ గా మేనిఫెస్టో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా యువనేత లోకేశ్ కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో పొత్తులపై కూడా చర్చలు జరుపుతున్నారు. జనసేనతో కలిసి వెళ్లేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి మరో కీలక అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. విజయదశమి రోజున టీడీపీ పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తామని వెల్లడించారు. పార్టీ మహానాడు వేదిక ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోకు కొనసాగింపుగా పూర్తిస్థాయిలో అందజేస్తామని చెప్పారు. మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.మహిళలు ఆత్మగౌరవం ఇస్తే తాను ఆత్మవిశ్వాసం ఇచ్చానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీని గెలిపించేందుకు ఈసారి మహిళలంతా కలిసి రావాలని చెప్పుకొచ్చారు. అయితే టీడీపీని ఈసారి అధికారంలోకి తీసుకురావడం రాష్ర్టానికే అవశ్యకమని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ర్టం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని, రాజధాని కూడా లేకుండా చేశాడని మండిపడ్డారు.
ఏపీ బాగుపడాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఆయన కోరుతున్నారు. అయితే జనసేనతో పొత్తుకు వెళ్లేందుకు సిద్ధమవుతన్నారు. ఇప్పటికే పొత్తలపై ఇద్దరు అధినేతలు కీలక చర్చ ముగిసినట్లు తెలుస్తున్నది. దీనిపై బయటకు చెప్పకున్నా వారికి ఒక క్లారిటీ ఉన్నట్లు సమాచారం. అయితే బీజేపీ విషయంలోనే ఒక అవగాహన కుదరలేదు. వారితో పొత్తు ఉంటుందా.. లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే బీజేపీ పొత్తు విషయంలో సమయం ముగిసిందని ఆయన చెప్పుకొచ్చారు.
ReplyForward
|