Delhi Liquor case : దేశవ్యాప్తంగా ఇటీవల తెరపైకి వచ్చిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సంచలనం సృష్టించింది. ఎందరో ప్రముఖుల పేర్లు ఇందులో వినిపించాయి. ఏకంగా ఢిల్లీ సీఎం పైనే ఇందులో ఆరోపణలు వచ్చాయి. మరోవైపు సౌత్ గ్రూప్ అంటూ మరికొందరు ప్రముఖులు ఇందులో పాత్రధారులుగా తేలింది. అయితే సౌత్ గ్రూప్ అనివాడొద్దని కోర్టు సూచించింది. ఒక్క ఢిల్లీకి చెందిన వ్యక్తులే కాకుండా ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన ప్రముఖుల పేర్లు ఇందులో వినిపించాయి. అయితే జైల్లో ఉన్న నిందితుడు ఓ మంచి పని కోసం పెద్ద మొత్తం విరాళం ఇవ్వడం ఇఫ్పుడు చర్చనీయాంశమైంది.
ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఏపీలో అధికార పార్టీ కి చెందిన రాఘవ, శరత్ చంద్రారెడ్డి ఇందులో అరెస్టయ్యారు. ఇందులో శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా మారారు. తెలంగాణ సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఇందులో ప్రముఖంగా వినిపించింది. ఈడీ పలుమార్లు ఆమెను ఢిల్లీకి పిలిపించుకొని విచారణ చేపట్టింది. ఆ తర్వాత ఆమె పేరు జాబితాలో లేకుండా పోయింది. బీఆర్ ఎస్ కూడా తమను ఇబ్బంది పెట్టేందుకే కవిత పేరు చేర్చారని అంతకుముందు పడింది. ఇప్పుడు ఇరు పార్టీలు కొంత సైలెంట్ అయ్యాయి. ఈవిషయంపై మాట్లాడేందుకు కూడా ఇరుపార్టీలు స్పందించడం లేదు.
అయితే ఇఫ్పుడు కేసులో ఢిల్లీకి చెందిన సుకేశ్ చంద్రశేఖర్ కీలకంగా మారారు. ఆయన ఇప్పటికే పలువురి నుంచి తాను డబ్బులు తీసుకున్నట్లు చెప్పారు. అయితే తాజాగా ఆయన ఒక విరాళం ఇచ్చి సంచలనంగా మారారు. ఇది తన సొంత డబ్బని, తన కష్టార్జితమని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఐటీ ఫైల్స్ కూడా ఆయన చూపించారు. ఇటీవల ఒడిశా రైలు ప్రమాదంలో పలువురు మృతి చెందగా, వారి పిల్లలకు అండగా నిలిచేందుకు ఆయన రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చాడు.
ఇది తన కష్టార్జితమని, తీసుకోవాలని విన్నవించాడు. అయితే దీనిపై రైల్వే శాఖ న్యాయశాఖను సంప్రదించింది. ఈ డబ్బులు తీసుకోవచ్చా.. లేదంటే ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయనా అనే కోణంలో వారు సంప్రదింపులు చేస్తున్నారు. ఏదేమైనా కొన్ని కుటుంబాలకు అండగా నిలిచేందుకు జైల్లో ఉన్న చంద్రశేఖర్ ముందుకు రావడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఆయనకు మద్దతుగా కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే సుకేశ్ చంద్రశేఖర్ ను కావాలని ఇరికించారని, ఢిల్లీ సీఎం ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.