Kavitha : దేశవ్యాప్తంగా కొన్నాళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనంగా మారింది. బడాబడా నేతల పాత్ర ఇందులో బట్టబయలైంది. ఇప్పటికే కొందరు జైలుకు వెళ్లారు. అయితే ఢిల్లీ స్కాం తెలుగు రాష్ర్టాలతో సంబంధం ఉండడమే ఇక్కడ సంచలనంగా మారింది.
తాజాగా ఈ కేసులో నిందితుడుగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారినట్లు సమాచారం. అయితే ఈయన ఏపీ సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరుంది. అయితే వైసీపీ మెడకు చుట్టుకుంటున్న వివేకా హత్య కేసు నుంచి ఉపశమనం కలిగిస్తే లిక్కర్ స్కాం కేసుతో ముడిపడి ఉన్న ఓ కీలక వ్యక్తి వివరాలు చెబుతామని సీఎం జగన్ చెప్పినట్లుగా అదే రాష్ర్టానికి చెందిన ఎంపీ రఘుకృష్ణమరాజు ఆరోపించారు. ఇదే నిజమైతే తెలంగాణ సీఎం కేసీఆర్ కు జగన్ షాకిచ్చినట్లే.
అయితే ఇటీవల సాక్షి పత్రికలో లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్రపై కథనాన్ని రాశారు. అంటే ఏపీ సీఎం జగన్ కేసీఆర్ కుమార్తె కవితను ఇరికించాలని ప్రయత్నిస్తున్నట్లు సదరు ఎంపీ అభిప్రాయపడ్డారు. అయితే అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు. అందుకే ఆయనను అప్రూవర్ గా మార్చి, కీలక వ్యక్తిని పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని చర్చ సాగుతున్నది.
గత ఎన్నికల్లో సహకరించిన సీఎం కేసీఆర్ ను జగన్ మోసం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి ఎవరి పేర్లు చెబుతారనే విషయమే ఇప్పుడు సంచలనం. నిందితులు అప్రూవర్ గా మారే అవకాశం ఉంటుంది. ఇక ఎంతమంది పాత్ర ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో తేలుతుందో లేదంటే అర్ధంతరంగానే ఎన్నికల వరకు కొనసాగుతుందో వేచి చూడాలి.