KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఆయన మాటల్లోనే ‘ఏదో ఒక పార్టీకి నేను వత్తాసు పలకడం సరికాదు. వాళ్ల రాజకీయాలు వాళ్లు చేసుకుంటున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారం జగనే గెలుస్తారు. ఎవరు గెలిచినా మాకు సంబంధం లేదు. ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోదు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఆలోచిద్దాం’ అని తెలిపారు.
అలాగే తాను మళ్లీ సీఎం అవుతానని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తామే అధికారంలోకి వస్తామని అన్నారు. తమ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, చాలా చోట్ల వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు.
ఏపీ రాజకీయాలపై తెలంగాణ మాజీ సీఎం మాటలు ఎంతవరకు నిజమవుతాయో తెలియదు. కానీ, ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.