Special Parliament Meeting :
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం అంతా సిద్ధం చేస్తోంది. ఈనెల 18 నుంచి 22 వరకు ఈ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నది. అయితే ఈ సమావేశాలను కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో నిర్మించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఈ భవనాలను మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
అయితే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కీలక బిల్లులను ఈ ప్రత్యేక సమావేశాల్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సెషన్ ఎజెండాను ఇప్పటివరకు కేంద్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే ఈ సమావేశాల ఎజెండా తెలపాలని ఇప్పటికే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ప్రధాని మోదీకి లేఖరాశారు. అయితూ విశ్వసనీయ సమాచారం ప్రకారం షెడ్యూల్ ఈ విధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో చర్చలు ఫలవంతం కావాలని ఆశిస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వ్యాఖ్యానించారు. వందేళ్ల భారత్ సందర్భంగా ఈ ‘అమృత కాలంలో’ జరుగుతున్న సమావేశాలకు ప్రత్యేకత ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే ప్రతిపక్షాలు మాత్రం తమకు ఐదు అంశాలపై ఎజెండా అని తెలిసిందని, మరో తొమ్మిది అంశాలపై కూడా చర్చించాలని కోరుతున్నారు. ఇందులో అదానీ అక్రమాలు, మణిపూర్ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ, కులాల వారీగా జనగణన, కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల మధ్య రోజురోజుకీ దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హరియాణా సహా దేశ వ్యాప్తంగా జరిగిన అల్లర్ల పై, చైనా అక్రమణలపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
అయితే కేంద్రం మాత్రం జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరసత్వం, మహిళా బిల్లు, రోహిణి కమిషన్ రిపోర్టు (సబ్ కేటగిరి ఆఫ్ ఓబీసీస్), ఇండియాను భారత్ గా మార్చే బిల్లు లాంటి ఐదు అంశాలపైనే చర్చ పెట్టనున్నట్లు తెలుస్తున్నది. ఈ దిశగా ఇప్పటికే ఎజెండా సిద్ధమైందని సమాచారం.