![Vijayamma](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/ys-sharmila-vijayamma-jagan.jpg)
Vijayamma : ఏపీలో పొలిటికల్ గేమ్ కొత్త మలుపు తిరిగిందా? వైసీపీ అధ్యక్షుడు జగన్ కు చెక్ పెట్టేందుకు విజయమ్మతో వైఎస్ షర్మిల వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా.. అసలు ఏపీపీసీసీ చీఫ్ స్కెచ్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగైందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీనికి పరోక్షంగా వైఎస్ షర్మిల కూడా కారణమన్నారు. అంతే కాదు బీజేపీని ఢీకొట్టి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన ఏపీలో మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైన తర్వాత ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కు తన సత్తా చాటేందుకు వైఎస్ షర్మిల మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ఆర్ కుటుంబంలో కీలకంగా ఉన్న వైఎస్ షర్మిల తన తండ్రి 75వ జన్మదిన వేడుకలను అవకాశంగా మలచుకోవాలని భావిస్తున్నారట. వైఎస్ఆర్ అభిమానులను, వైసీపీ నేతలను మళ్లీ కాంగ్రెస్ గూటికి చేర్చడమే ప్రధాన ఎజెండాగా ఆ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. అందుకే విజయవాడలో జరిగే వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలకు రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నారు.
అంతే కాదు ఇదే వేదికపై కాంగ్రెస్ అగ్రనేతలతో కలసి పాల్గొనాల్సిందిగా తల్లి విజయమ్మకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల ప్లాన్ అనుకున్నట్లు జరిగితే కాంగ్రెస్ కు దీటుగా మైలేజ్ పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో వైసీపీ పార్టీకి మద్దతిచ్చే వారు లేరు. ప్రభుత్వంలో ఉండగా జరిగిన అక్రమాలు, గతంలో ఉన్న కేసులు తిరగదోడితే జగన్ ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది.