Jenasna : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంత కాలంగా ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏపీలోని వైసీపీ సర్కారుకు ముచ్చెముటలు పోయించేలా ఆయన పర్యటన ఆద్యంతం కొనసాగింది. వారాహి యాత్ర ద్వారా ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటనకు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. అయితే ఇప్పుడు ఆయన పొలిటికల్ టూర్ కు కాస్త విరామం ఇవ్వబోతున్నారు.
అయితే ఆయన నటిస్తున్న సినిమా ఓజీ సెట్స్ పై ఉంది. ఇప్పటికే 60 శాతం టాకీపార్ట్ పూర్తయింది. అత్యంత హై ఓల్టేజీ యాక్షన్ మూవీ గా ఇది చిత్రీకరణ కొనసాగుతున్నది. కొద్ది రోజుల కిందటే ముంబైలో షూటిగ్ ప్రారంభమైంది. రన్ రాజా రన్, సాహో చిత్రాలను తీసి సుజిత్ ఈ సినిమాకు దర్శకుడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు. ఈసినిమాలో తమిళ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇక బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్నారు.
ఇక ప్రకాశ్ రాజ్, తమిళ నటులు అర్జున్ దాస్, హరీశ్ ఉత్తమన్ లాంటి నటులు ఇందులో నటిస్లుున్నారు. అయితే అక్టోబర్ లో షూటింగ్ బ్యాంకాక్ లో పూర్తి చేయడానికి పవన్ టైమ్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ స్పాట్ ను ఎంపిక చేసుకుంటుంది. ఇక అక్టోబర్, నవంబర్ మొదటి వారాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకపోవచ్చని సమాచారం. నవంబర్ మధ్యలో ఆయన మళ్లీ క్రియాశీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వారాహి మూడో విడుత యాత్ర కూడా అప్పుడే మొదలవుతుందని సమాచారం. అయితే జనసేన శ్రేణులకు మాత్రం ఎప్పుడూ ప్రజల్లోనే ఉండాలని పవన్ దిశానర్దేశం చేశారు.