Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు వైసీపీలో చేరనున్నారు. తన కుమారుడు గిరి తో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాల యంలో జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకో నున్నారు. ఇప్పటికే ఆయన కిర్లంపూడి నుంచి తాడేపల్లి కి చేరుకున్నారు.
తొలుత ర్యాలీగా తాడేపల్లికి వస్తానని ముద్రగడ ప్రకటించారు. అయితే భారీ సంఖ్యలో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని ఒక్కడినే వెళ్తానని మరో ప్రకటన చేశారు. ఏపీ రాజకీయాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన కాపు ఉద్యమ నేత ముద్రగడ చెట్టు రాజకీయం తిరిగింది.
మొదట జనసేనలోకి వెళ్లడం ఖాయమని తెలిసింది. కచ్చితంగా జనసేనలో చేరుతున్నట్లు కూడా ముద్రగడ నుంచి సమాధానం వచ్చింది. ప్రకటన చేసిన కొద్ది రోజులకి ఆయన నిర్ణయం మారింది. తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ తాను వైసిపిలో చేరుతున్నట్లు ముద్రగడ ప్రకటించారు.