KCR Brahmastra : తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా రావచ్చు. ఇప్పటికే ఈసీ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఆయా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఢిల్లీలో శుక్రవారం సమావేశం నిర్వహించింది. రానున్న మూడు రోజుల్లో సెడ్యూల్ విడుదలవుతుందని సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మేనిఫెస్టోను కూడా షెడ్యూల్ అనౌన్స్ కావడంతోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ అభ్యర్థుల ఎంపికలోనే తలమునకలయ్యాయి. దీంతో హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ ఫుల్ ధీమాతో ఉన్నారు. దీనిలో భాగంగానే ప్రతిపక్షాలపై బ్రహ్మాస్త్రం సంధించేందుకు సిద్ధం అవుతున్నారు.
కర్ణాటక గెలుపుతో మరింత ఊపు మీదున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాలను ప్రకటించడంలో తాత్సారం చేస్తున్నా.. గెలిచే వారి కోసం సన్నాహాలు చేస్తుంది. ఇక్కడ కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. కర్ణాటక తర్వాత తమకు ఇక్కడే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధిష్టానం భావించడంతో మరింత ఫోకస్ పెట్టారు పార్టీ పెద్దలు. ఇక మొదట్లో పోరాడి తర్వాత చతికిలపడ్డ బీజేపీ తాము కూడా పోటీలో ఉన్నామని ఇటీవల ట్రైబల్ యూనివర్సిటీ, పసుపు బోర్డును ప్రకటించారు. ఇవన్నీ నిశితంగా గమనిస్తున్న కేసీఆర్ భారీ ఎత్తు వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.
ఎలాగైనా హ్యాట్రిక్ సాధించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. దీనిలో భాగంగా చేవెళ్ల డిక్లరేషన్ ను తలదన్నేలా పథకాలు ఉండాలని భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంక్ ను తన వైపునకు తిప్పుకునేలా కీలక ప్రకటన చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రైతులు, యువతను కూడా దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మేనిఫెస్టోలో పెట్టిన పథకాల ఖర్చు విషయంలోనే ఆలోచిస్తున్నారని పార్టీ నుంచి లీకులు వినిపిస్తున్నాయి.
వృద్ధాప్, వితంతు పింఛన్లుకు రూ. 1000 పెంచే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు ఒంటరి మహిళా పింఛన్, రైతు పింఛన్, గ్యాస్ సబ్సిడీలను కూడా పెంచే దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ లో రాష్ట్ర పన్ను వాటాను కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ సారి నిరుద్యోగ భృతి తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పైసలను పెంచే అవకాశం. రైతు బంధు కూడా ఎకరాకు రూ. 1000 పెంచాలని ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.
వీటని మేనిఫెస్టోలో పెడితే తమను కొట్టే పార్టీ గానీ, వ్యక్తి గానీ లేడని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ నుంచి లీకులు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన మేనిఫెస్టో దాదాపు పూర్తయిందని, రేపో మాపో రిలీజ్ చేయవచ్చని తెలుస్తోంది.