Rythu Bandhu Stop : తెలంగాణలో ఎన్నికలకు మరో 35 రోజుల గడువు మాత్రమే మిగిలింది. ఈ రేసులో బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్లుగా కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ ను గట్టిగా ఢీకొడుతున్నది. ఇక ఉత్తర తెలంగాణ పై ప్రధాన దృష్టి పెట్టింది. అధికార బీఆర్ఎస్ కు ఒకనొక దశలో ముచ్చెముటలు పోయిస్తున్నది.
అయితే అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉన్న ఏ అంశాన్ని కూడా కాంగ్రెస్ విడిచి పెట్టడం లేదు. ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులను ఈసీ ట్రాన్స్ ఫర్ చేసింది. దీంతో పాటు రాష్ర్ట డీజీపీపై కూడా ఫిర్యాదు చేసింది. ఆయనను వెంటనే బదిలీ చేయాలని విన్నవించింది. ఇక రైతుబంధుపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై విమర్శలు వస్తు్న్నాయి.
ఇలాంటి సమయంలో రైతు బంధును నిలిపివేయాలని కోరడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇబ్బందికర పరిస్థితిగా తయారవుతుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరడ ఇప్పుడు అధికార పార్టీకి ఆస్ర్తంగా మారబోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ రద్దు చేస్తారని అధికార పార్టీ ప్రచారం చేసుకునే వీలు కలిగింది.
కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ రైతు బంధు పథకం నిలిపేయాలని కేంద్ర ఎణ్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పడం ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నది. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఉచ్చులో పడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రైతు బంధు నిర్ణయాన్నిర రైతులు కూడా హర్షించే పరిస్థితి లేదు. వారంతా ఈ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నారు.ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై మండిపడుతున్నారు.