Karimnagar News : గుండెపోటుతో ఓ లారీ డ్రైవర్ ఆదివారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్ కు చెందిన ఖలీల్ (55) అనకాపల్లి నుంచి సిద్దపేటకు లారీలో వెళ్తూ మార్గమధ్యలో కల్లూరు ఎన్ఎస్ పిలోని ఓ హోటల్ వద్ద భోజనానికి ఆపారు.
భోజనం చేసిన తర్వాత తిరిగి లారీ ఎక్కుతుండగా గుండెపోటు రావడంతో ఖలీల్ కుప్పకూలాడు. దీంతో స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేశారు. దాదాపు 45 నిమిషాల వరకు అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీఓించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఖలీల్ ఆర్టీసీ డ్రైవర్ గా జగిత్యాల డిపోలో పనిచేసి 2014లో ఉద్యోగ విరమణ చేసినట్లు తెలిసింది.