Guntur Karam Poster : త్రివిక్రమ్ శ్రీనివాస్-సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో మూడో చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకు ‘గుంటూరు కారం’ అని టైటిల్ ఖారారు చేసింది చిత్ర యూనిట్. మొదలు చాలా టైటిల్స్ ను పరిశీలించిన మూవీ మేకర్స్ చివరికి దీనినే ఫైనల్ చేసింది. ఎందుకంటే వారు చెప్పిన టైటిల్స్ లో ఏవీ మహేశ్ బాబుకు నచ్చలేదంట.. ‘గుంటూరు కారం’ ఒక్కటే మహేశ్ కు పిచ్చ పిచ్చగా నచ్చిందట. దీతో ఇదే ఫైనల్ చేశారట. ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున విడుదల చేయాలని భావించారు మేకర్స్. ఇందులో భాగంగానే బుధవారం (మే 31) సాయంత్రం విడుదల చేశారు.
సాయంత్రం గ్లిమ్స్ ను విడుదల చేయనుండడంతో ఉదయం మోషన్ పోస్టర్ ను మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయించింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో తలకు రెడ్ కలర్ టవాల్ కట్టుకొని ఫైట లోకి దూకుతున్న మహేశ్ బాబును చూసి ఫ్యాన్ బాగా ఎంజాయ్ చేశారు. తమ హీరోను మాస్ గా చూడడం అంటే వారికి చాలా ఇష్టమట. ఇక త్రివిక్రమ్ తో మహేశ్ బాబు కలిసి తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా మారాయి. ఇది కూడా అలాగే మారుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహేశ్ బాబు కూడా పూర్తి స్థాయి మాస్ మూవీ చేసి చాలా కాలమే అయ్యింది. మొన్నటి నుంచి మాస్ స్ట్రైక్ అని ప్రచారం చేస్తూ, ఈ గ్లిమ్స్ కు సంబంధించిన ఒకే ఒక్క పోస్టర్ ను మూడు యాంగిల్స్ లో రిలీజ్ చేయడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గ్లిమ్స్ లో ఈ ఒక్క షాట్ మాత్రమే ఉందా..?, ఎందుకు ఒకే షాట్ ను పోస్టర్ లో తిప్పి తిప్పి చూపిస్తున్నారు అంటూ మూవీ టీంపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. సినిమా చాలా భాగం వరకూ షూటింగ్ పూర్తియినట్లు వార్తలు వినిపిస్తున్నా నేపథ్యంలో మరి కొన్ని సన్నివేశాలు కూడా పోస్టర్ లో చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం 6.03 గంటలకు థియేటర్స్ లో ప్లే చేయనున్నారు. ఇక 6.30గంటలకు యూట్యూబ్ లో పెట్టనున్నారు మేకర్స్. మహేశ్ ఫ్యాన్స్ గ్లిమ్స్ కోసం ఎదురు చూస్తున్నారు.