NATS : అట్లంటాలోని భారత కాన్సులేట్ ప్రధానాధికారి రమేశ్ బాబు లక్ష్మణ్ తో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స అట్లాంటా ప్రతినిధులు సురేశ్ పెద్ది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాట్స్ హెల్ప్ లైన్, అమెరికాకు వచ్చే విద్యార్థులకు అవగాహన శిబిరాలు, గృహహింస బాధితులకు చేయూత, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు, స్థానిక సేవ కార్యక్రమాలు వంటి విషయాలపై చర్చించారు. రాయబార కార్యాలయంతో నాట్స్ సమన్వయం తెలుగు వారికి మరిన్ని సేవలందించేందుకు అవకాశం కల్పిస్తుందనే ఆశాభావాన్ని ఇరువర్గాల ప్రతినిధులు వెలిబుచ్చారు.