Minister KTR : జీవితంలో ఏదో కావాలని అనుకుంటారు. కానీ ఇంకా ఏదో అవుతుంటారు. ఇంజినీరో డాక్టరో కావాలని కోరుకుంటారు. చివరకు ఇంకో పనిలో స్థిరపడతారు. ఇలా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఇలాగే చేశారు. తల్లి డాక్టర్ కావాలని తండ్రి ఐఏఎస్ కావాలని కోరుకున్నారు. కానీ చివరకు రాజకీయ నాయకుడిగా మారారు. ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఏదో కావడం మనం చేస్తూనే ఉంటాం. అలా కేటీఆర్ జీవితం కూడా పలు మలుపులు తిరిగింది.
సిరిసిల్లలో వైద్య కళాశాల ప్రారంభోత్సవం తరువాత మాట్లాడిన కేటీఆర్ తన మనసులోని మాటను వెల్లడించారు. అప్పట్లో డాక్టర్ కావాలని ఎంసెట్ రాసినప్పుడు 1600 ర్యాంకు వచ్చింది. కానీ సీటు మాత్రం రాలేదు. దీంతో డాక్టర్ కావాలనే కోరిక మధ్యలోనే ఆగిపోయింది. తరువాత ఐఏఎస్ చదవాలని అనుకున్నా అనుకోని పరిస్థితిలో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడాల్సి వచ్చింది.
తెలంగాణ ఉద్యమంలో ప్రదాన పాత్ర పోషించి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు సిరిసిల్లలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. ఇప్పుడు సిరిసిల్లకు జేఎన్టీయూ, మెడికల్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ రావడం సంతోషం. వైద్యం ఎంతో పవిత్రమైన పని. చావు బతుకుల మధ్య ఉన్నవారిని రక్షించే దేవుడే డాక్టర్. అలాంటి వారిని తయారు చేయడం సంతోషకరం.
ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఏడాదికి 10 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. నేను కూడా బైపీసీ విద్యార్థినే. అందుకే డాక్టర్ ను కలెక్టర్ ను కాకపోయినా రాజకీయ నాయకుడిగా మారాను. దీంతో ప్రజలకు సేవ చేయాలనేదే లక్ష్యం. ఈనేపథ్యంలో కేటీఆర్ వైద్యం కోసం కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసే డాక్టర్ పని ఎంతో మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.