Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇస్తోంది. రైతు బంధు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. పలు మార్లు రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తోంది. రెండు పంటలకు గాను పంటకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఇస్తోంది. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో రబీ రైతుబంధు వాయిదా వేసింది. కానీ ఎన్నికల కమిషన్ ఇవ్వొచ్చని పచ్చ జెండా ఊపడంతో రైతుబంధు ఇచ్చేందుకు రెడీ అయింది.
ఈనేపథ్యంలో ఎన్నికలు ఐదు రోజులే ఉండటంతో ఇది అధికార పార్టీకి అనుకూలంగా మారనుందని పలువురు విమర్శలు చేస్తున్నారు. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం దీంతో ఎలాంటి లబ్ధి చేకూరదు. లబ్ధిదారులకు నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. దీని వల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని కమిషన్ తేల్చింది. విశ్లేషకులు కూడా దీనిపై కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిధులు డీబీటీ విధానంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడతాయని అంటున్నారు. ఎన్నికల వేళ రైతుబంధు బీఆర్ఎస్ కు గేమ్ చేంజర్ గా మారనుందా అనే కామెంట్లు వస్తున్నాయి. రైతుబంధుతో ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవని చెబుతున్నారు. ఇది అధికార పార్టీకి వరంలా మారనుందని అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో అధికార పార్టీ ఏదైనా మతలబు చేసిందా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా రైతుబంధు నిధులు పడనున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఇది ప్లస్ కానుందని వాదనలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ దీంతో కొన్ని ఓట్లు కొల్లగొట్టడం ఖాయమని చెబుతున్నారు.