![Pemmasani Chandrasekhar](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/25gbGR4DJ0o-HD.jpg)
Pemmasani Chandrasekhar : పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన గుంటూరు లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. పెమ్మసాని వైద్యుడని అందరికీ తెలిసిందే. ఆయన అమెరికాలో పెద్ద వ్యాపారి కూడా. తాజాగా మోడీ కేబినెట్ లో కేంద్ర సహాయ మంత్రిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం చేశారు. అమెరికాలో పెద్ద వ్యాపారి కావడంతో ఈయన భారత్ కు పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనున్నారు.
విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి పెమ్మసాని అనుభవం పనికి వస్తుంది. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితిలో కంపెనీలు తీసుకురావాల్సిన అవసరముంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంపెనీలు పెద్ద ఎత్తున ఏపీకి రావాలంటే అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న పెమ్మసాని అవసరం ఏపీకి ఉంది. కేంద్రంలో మంత్రి పదవి వరించడంతో ఆయన ద్వారా ఏపీకి పెట్టుబడులు తీసుకురావొచ్చు. అలాగే వివిధ కంపెనీలు స్థాపించి ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.
ఈ కారణం చేత పెమ్మసాని పేరుని చంద్రబాబు పరిగణలోకి తీసుకొని కేంద్రమంత్రి పదవిని ఇచ్చారు. పెమ్మసానికి కేంద్రంలో మంత్రి పదవి ఖాయం కావడంతో ఏపీకి వరంగా మారింది.
కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెమ్మసాని వీడియోను కింద చూడొచ్చు.