Political Lions Club Analysis : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఏపీ పై పడింది. ఏపీలో గెలుపు ఎవరిది అన్నది ఆసక్తిగా మారింది.
అయితే జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ కూడా జగన్ క్లీన్ స్వీప్ చేస్తాడని.. వైసీపీ అధికారంలోకి వస్తుందని ఘోషిస్తున్నాయి. కానీ ఏపీలో క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే మాత్రం వైసీపీపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అందుకే జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను సైతం మార్చి వ్యతిరేకత తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జనం నాడి జనసేన వైపే ఉందని తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రీ పోల్ సర్వేను నిర్వహించరు. ప్రసాద్ కందెగుల అనే అనలిస్ట్ సారథ్యంలో నడుస్తున్న ‘పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలసిస్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో షాకింగ్ ఫలితలు వెలువడ్డాయి.
టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని ఏపీలో పోటీచేస్తే 141 సీట్లు ఖాయమని అందులో తేలింది. ఇక వైసీపీ కేవలం 34 సీట్లలో మాత్రమే గెలుస్తుందని.. చంద్రబాబు, పవన్ లకు బంపర్ మెజార్టీ ఖాయమని కుండబద్దలు కొట్టింది. మరే పార్టీకి కూడా ఏపీలో సీట్లు రావని తేల్చింది.
ఈ సర్వే ప్రతీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో క్లియర్ కట్ గా అంచనా వేసింది. ఆ లిస్ట్ ను మేం కింద ఇస్తున్నాం చూడండి.