Poonam Kaur తెలుగు నటి పూనమ్ కౌర్.. అంటే తెలుగు రాష్ర్టాల్లో తెలియన వారుండరు. ఆమె ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఒకటి, రెండు సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయి పేరు రాలేదు. అయితే ఆమె మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఏదో ఒక సంచలన పోస్టు పెడుతూ తనకు నచ్చని వాటిని విమర్శిస్తున్నారు. అయితే ఆమె చేనేత వస్ర్తాలపై మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఏపీ పాలిటిక్స్ పై సంచలన ట్వీట్ చేశారు. అయితే ఒక పార్టీ అధినేత పైనే అని అంతా చర్చ జరుగుతున్నది.
ఏపీలో ఈ మధ్య కొందరు ఫేక్ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. మహిళలకు ఏదో జరిగిపోతుందని ఆందోళన ఉంటే, ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎక్కడికి పోయారు.. అంటూ విమర్శించారు. రెజ్లర్ల ఆందోళనపై ఒక్క మాట కూడా మాట్లడలేదు. వాళ్ల సొంత ప్రయోజనాల కోసమే ఏపీలో నకిలీ లీడర్లు ఎక్కడా లేని ప్రేమను ప్రజలపై కుమ్మరిస్తున్నారు. ఇలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి అంటూ నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.
అయితే ఈ ట్వీట్ ఏపీలో ఏ లీడర్ ను ఉద్దేశించి అనేది మాత్రం ఆమె పెట్టలేదు. కానీ కొందరు ఆమె పై అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు అంటూ ఆయన ఫ్యాన్స్ పూనమ్ పై విరుచుకుపడుతున్నారు. ఇంకోసారి ఇలాంటి కామెంట్లు పెడితే బాగుండదని ఆమెకు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. దీంతో ఆమె ఇన్ స్టాలో మరో పోస్టు పెట్టారు. మీరందరూ నా పేరు ‘కౌర్’ అని గుర్తు పెట్టుకొండి. సుమారు గా ఐదేండ్లు అవుతున్నది. కొంచెం ఆలోచించండి అని పోస్టు చేశారు.
అయితే కొంతకాలం క్రితమే పూనమ్, పవన్ మధ్య ఏదో జరిగిందంటూ ప్రచారం జరిగింది. నిజానికి గత ప్రభుత్వ హయాంలో పూనమ్ ని చేనేత కు బ్రాండ్ అంబాసిండర్ గా నియమించారు. అప్పుడు పవనే కారణమంటూ అంతా చర్చించుకున్నారు. అయితే వీరి మధ్య ఎఫైర్ ఉందంటూ కూడా గతంలో వార్తలు వచ్చాయి. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కాని.. పూనమ్ గతంలో కూడా పవన్ ను ఉద్దేశించే పలు ట్వీట్లు చేశారు. ఇవి చదివిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. అయితే పవన్ కారణంగా పూనమ్ ఏదో బలంగా దెబ్బతిని ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఆమె ఇటీవల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువగా హాజరవుతున్నారు. మానసిక ప్రశాంతత కోసమే అలా చేస్తున్నారని టాక్ వినిపిస్తున్నది.