Telangana : రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు, ఎల్లుండి కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇటీవల అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడింది. మరి కొన్న రోజులు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో కల్లాల వద్ద ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.