RGV పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ సినిమా జులై 28న రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.. బ్రో సినిమా ఏ ముహూర్తాన రిలీజ్ అయ్యిందో కానీ ఈ సినిమా చుట్టూ రాజకీయం జరుగుతుంది.. బ్రో సినిమా రిలీజ్ తర్వాత పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ మంత్రి అంబటి రాంబాబు లా వివాదం మారిపోయింది.
అంబటి రాంబాబు ఈ బ్రో సినిమాపై సీరియస్ గా ఉన్నారు. ఈ సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఇమిటేట్ చేసే విధంగా చూపించడంతో ఆయన సీరియస్ అయ్యారు.. అంబటి రాంబాబును అనుకరిస్తూ పృథ్వీ డ్యాన్స్ వేయడంపై ఆయన సీరియస్ అవ్వడమే కాకుండా ఈ విషయంలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ పై గట్టి కౌంటర్లు వేస్తూనే ఉన్నారు.
ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు.. మరి వీరి మధ్య వివాదం జరుగుతుండగా మధ్యలో పూనమ్ కౌర్ ఎంటర్ అయ్యింది.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ.. రాజకీయాలు ఎంటర్టైనింగ్ గా మారితే.. ఎంటర్టైన్మెంట్ కాస్త సీరియస్ గా మారాయి అంటూ ఈమె సెటైర్స్ వేసింది..
ఇక ఇంత మంది ఉండగా రామ్ గోపాల్ వర్మ సెటైర్స్ వేయకుండా ఉంటారా.. అది కూడా ఏపీ రాజకీయాలపై.. సమస్యే లేదు.. అందుకు ఆయన కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు.. ట్విట్టర్ ద్వారా పూనమ్ కౌర్ కు రిప్లై ఇస్తూ.. రాజకీయాలు ఎంటర్టైనింగ్ గా మారాయంటూ ఈమె చేసిన వాదనలతో ఏకీభవించట్లేదు నో సిస్టర్ అంటూనే.. రాజకీయాలు సినిమాలుగా.. సినిమాలు రాజకీయంగా తయారయ్యాయని కామెంట్స్ చేసారు.