Samantha : దైవభక్తి కంటే దేశభక్తి గొప్పది. దేశం కోసం ఏం చేసినా అందులో త్యాగం ఇమిడి ఉంటుంది. మన దేశంలో పుట్టిన వారు చాలా మంది విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడిపోతున్నారు. దీంతో మన దేశ సంప్రదాయాలను మాత్రం మరిచిపోవడం లేదు. ఏదేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ జాతి నిండు గౌరవమూ అన్నట్లు మన ఆచార వ్యవహారాలను అక్కడ జరుపుకోవడం విశేషం.
ఇందులో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ లో ఇండియా డే పరేడ్ కార్యక్రమంలో సినీనటి సమంత పాల్గొన్నారు. మన దేశ ఔన్నత్యాన్ని గుర్తుచేసుకునే వేడుకలు ఇక్కడ కూడా జరుపుకోవడం విశేషం. భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో నిర్వహించిన వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
ఈ సందర్భంగా సినీనటి సమంత మాట్లాడుతూ మన దేశ వేడుకలు ఇక్కడ జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఈ రోజు న్యూయార్క్ లో ఉండటం నాకు గర్వంగా అనిపిస్తుంది. మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేసే అవకాశం ఏర్పడటం బాగుంది. ఈ క్షణాలు నా జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమెరికా ప్రజలకు దన్యవాదాలు తెలిపారు.
ఈ వేడుకల్లో గతంలో అల్లు అర్జున్, అభిషేక్ బచ్చన్, రానా, రవీనాటాండన్, సన్నీ డేఓల్ తదితరులు పాల్గొన్న సంగతి తెలిసిందే. న్యూయార్క్ లో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాల్గొన్నారు. అమెరికాలో జరిగిన వేడుకల్లో మనవారు చాలా మంది పాల్గొనడం ఆనందం కలిగించింది.