– కూటమిగా ముందుకు.. భాష్యంతో బీజేపీ, జనసేన నేతలు
Bhashyam Praveen : పెదకూరపాడు నియోజకవర్గంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గెలుపు కోసం మూడు పార్టీలు ఏకమయ్యాయి. టీడీపీతోపాటు బీజేపీ, జనసేన నియోజకవర్గ ఇన్ చార్జిలు కలిసి వచ్చి భాష్యంతోపాటు నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీంతో ఈ మూడు పార్టీల మధ్య సామరస్య పూర్వక వాతావరణం నియోజకవర్గంలో నెలకొన్నట్టైంది.
భాష్యం ప్రవీణ్ ను టీడీపీ టికెట్ పై ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించగానే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హర్షం ప్రకటించారు. తమ మద్దతు భాష్యంకేనని.. ఆయనను గెలిపించుకుంటామని తెలిపారు. అందుకే ఉమ్మడి నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించి అందరినీ కలుపుకొని భాష్యం ఎన్నికల ప్రచారంలోకి దూకారు.
ఈరోజు క్రోసూరు మండల కేంద్రంలో పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని జనసేన, బిజెపి పెదకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జిలతో కలిసి పెదకూరపాడు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. అనంతరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల అధ్యక్షులతో సమావేశమై రానున్న ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు.
మూడు పార్టీల నేతలు, ఇన్ చార్జీలు భాష్యం గెలుపు కోసం పనిచేస్తామని.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ప్రచార పర్వలోకి దూకారు. భాష్యం గెలుపునకు అసలు పోటీనే లేదంటూ నినదించారు.