టీడీపీ-జనసేన ఎన్నికల పొత్తును ప్రకటించిన సందర్భంగా పవన్ బీజేపీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ మాతో కలుస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. అది నూటికి నూరు శాతం జరుగుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. జగన్ పాలనకు వ్యతిరేకంగా తమ కూటమి పోరాటం చేస్తుందని ఆయన ప్రకటించారు.
ఇది ఇలా ఉంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏపీ బీజేపీ నేతలు పదేపదే ప్రతిఘటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు టీడీపీతో కాకుండా జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
జగన్తో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ కారణం చెప్పారు. ఈ పొత్తుకు కారణం జగన్ అని పవన్ అన్నారు. ‘మేం పొత్తు గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఈ రోజే టీడీపీతో పొత్తు పెట్టుకొని కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పురోగతిపై వైసీపీ పాలన ప్రభావం చూపుతోందని’ పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లేవని పవన్ వైసీపీ ప్రభుత్వం మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పాలనకు చరమగీతం పాడాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు తన నిర్ణయాన్ని అంగీకరించి టీడీపీతో కలిసి పనిచేయాలని పవన్ కోరారు. మొత్తంమీద పవన్, చంద్రబాబులు బీజేపీని ఇరకాటంలో పెట్టారు.