‘ముఖ్యమంత్రి ప్రజలను కలవడం లేదు.. ముఖ్యమంత్రి ప్రజలకు వద్దకురావడం లేదని.. ముఖ్యమంత్రి వద్దకు ప్రజలను ఎందుకు అనుమతించరు ఎవరో ఒకరు ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు. వాటిని సీరియస్ గా తీసుకోవద్దు. ముఖ్యమంత్రి కింద అధికార యంత్రాంగం పని చేస్తూ ఉంటుంది. గ్రామ స్థాయి వరకు చూసుకుంటే 6.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యేల నుంచి వార్డు మెంబర్ల వరకు పాలనా యంత్రంగం ఉంది. ఒక వైపు లెటస్లేచివ్ సైడ్ ప్రజా ప్రతినిధులు ఉంటే.. ఎగ్జిక్యూటివ్ సైడ్ అధికారులు ఉన్నారు.
ఇక ముఖ్యమంత్రిని కాలిసే వారు పింఛన్ కావాలని, డ్రేనేజీ సమస్య ఉందని, రోడ్లు బాగోలేవని ఇలాంటి సమస్యలతో రావద్దు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి సంబంధించి సూపర్ పవర్. ఇటు అధికార యంత్రాంగం, అటు పాలకులు పరిష్కరించలేని జఠిలమైన సమస్య ఏర్పడితే తప్ప ముఖ్యమంత్రి వరకు వెళ్లద్దు. అసలు సీఎం చేసే పనులు వేరు. ప్రజా సంక్షేమం కోసం శాసన సభలో బిల్లులు పెట్టడం, వాటి రూపకల్పన, బిల్లులపై అధికార యంత్రాంగం పనితీరు. శాసన సభ్యులతో పని చేయించే విధానం ఇంకా ఇలాంటి చాలానే ఉంటాయి. కానీ చిన్న చిన్న విషయాలను ముఖ్యమంత్రి పట్టించుకుంటే పాలన గాడి తప్పుతుంది. ఇక తన ఉద్యోగులు ఏ మేరకు పని చేస్తున్నారన్న విషయం కూడా తెలియదు’ అంటూ చెప్పేవారన్నారు కేటీఆర్.
ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని ప్రతిపక్షాలు మరోలా అర్థం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. మరి కేటీఆర్ ఇంత చెప్తున్నా పాలన ఎందుకు గాడి తప్పుతుందో కూడా చెప్తే బాగుండని కాంగ్రెస్, బీజేపీ ఫాలోవర్స్ కామెంట్లు పెడుతున్నారు.
ReplyForward
|