Nagarjuna-Amala : అక్కినేని నాగార్జున, అమల దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీలు హిట్ కావడంతో ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నారు. అక్కినేని అమలకు జంతువులు అంటే ఎంతో ఇష్టం. ఆమెకు కుక్కలంటే ప్రాణం. అయితే వీరు ఇంట్లో చాలా కుక్కల్ని పెంచుకునే వారంట. అయితే ఓ కుక్క విషయంలో నాగార్జున తనతో గొడవపడి నెల రోజులు మాట్లాడలేదని అమల ఓ ఇంటర్య్వూలో చెప్పింది.
నాగార్జునతో పెళ్లి తర్వాత అమల బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ లో చేరింది. ఈ సంస్థ జంతువుల సంరక్షణ కోసం పని చేస్తుంటుంది. అయితే అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లోకి ఓ కొత్త కుక్కను కొనుక్కొని వచ్చారని అది కాస్త ఇంటికి వేరే వాళ్లు ఎవరైనా వస్తే వారిని రానిచ్చేది కాదంట. అది లాబ్రాడర్ జాతికి చెందిన కుక్క.. అప్పటి వరకు ఇంట్లో అన్ని ఇండియన్ డాగ్సే ఉండేవి.
దీంతో ఆ కుక్క అంటే నాగార్జునకు చాలా ఇష్టం ఏర్పడింది. లాబ్రాడర్ డాగ్ అందరి మీదకు ఎగబడుతుండడంతో అంతటి స్పెషల్ కుక్కను నాగార్జునకు తెలియకుండా నెల రోజుల పాటు అమల ట్రైనింగ్ కు పంపించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన నాగార్జునకు లాబ్రాడర్ కుక్క కనిపించకపోవడంతో అమలు ప్రశ్నించాడంట. జరిగిన విషయం చెప్పడంతో అమలతో మాట్లాడటం మానేశాడంట. అప్పటి నుంచి ఆ కుక్క ఇంటికి వచ్చే వరకు మౌనంగా ఉండిపోయాడంట.
రోజూ షూటింగ్ చేసి ఇంటికి వచ్చే సరికి లాబ్రాడర్ జాతి కుక్క కనిపించగానే నాగార్జున ఫ్రీ అయిపోయేవారు. కానీ అది కనిపించకపోయే సరికి ఆయన తట్టుకోలేక పోయారు. సెలబ్రెటీ జీవితాల్లో మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అవి ఎక్కువ విశ్వాసంతో ఉంటాయని మోసం చేయవని వారి నమ్మకం. అయినా ఒక కుక్క కోసం నాగార్జున, అమల నెల రోజులు మాట్లాడకపోవడం ఫన్నీగా అనిపించినా.. వాటిపై వారికి ఉన్న ప్రేమ ఎంత అనేది అర్థం చేసుకునే వాళ్లకు తెలుస్తుంది.