Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల్లో మాస్ ఆడియన్స్ ని ‘గుంటూరు కారం’ చిత్రం తర్వాత విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్రం అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘నా సామి రంగ’. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలను చేసి చేతులు కాల్చుకున్న నాగార్జున, చాలా కాలం తర్వాత చేస్తున్న పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ మూవీ ఇది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు మరియు టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ సినిమా కావడం తో బీ,సి సెంటర్స్ లో ఈ సినిమాకి బిజినెస్ కూడా మామూలు రేంజ్ లో జరగడం లేదు. రీసెంట్ సమయం లో నాగార్జున కి ది బెస్ట్ బిజినెస్ దీనికే జరిగింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో నాగార్జున కి తమ్ముళ్లుగా అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ లు నటించిన సంగతి తెలిసిందే.
అక్కినేని నాగార్జున కి జోడిగా కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ నటించగా, అల్లరి నరేష్ కి జోడిగా, నాగార్జున కి చెల్లెలుగా మిర్న మీనన్ నటించింది. ఈమె గత ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రం లో, రజిని కి కోడలిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆమె ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ ని సంపాదించింది. అంతకు ముందు ఈమె కన్నడ మరియు మలయాళం భాషల్లో చాలా సినిమాలే చేసింది. అన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఆమెకి జైలర్ చిత్రం తెచ్చిపెట్టింది. అంతే కాదు, గత ఏడాది అల్లరి నరేష్ హీరో గా నటించిన ‘ఉగ్రం’ సినిమాలో హీరోయిన్ కూడా ఈమెనే. ఈ సినిమాతో రెండవసారి ఆయనతో జతకట్టబోతుంది. ఈమెకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రీసెంట్ గానే విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ నెల 14 వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి ధమాకా రైటర్ ప్రసన్న కుమార్ కథని అందించగా, విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. మాస్ మరియు ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటుగా, సెంటిమెంట్ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉంటాయని, క్లైమాక్స్ సన్నివేశం ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టిస్తుందని ఒక టాక్ ఉంది, చూడాలి మరి, అది ఎంత వరకు నిజం అనేది.