26.3 C
India
Monday, June 17, 2024
More

    Ex-Minister Botsa Satya Narayana : ఆ జిల్లా క్లీన్ స్వీప్ చేయబోతున్నాం మాజీ మంత్రి బొత్స విశ్వాసం

    Date:

    Ex-Minister Botsa Satya Narayana
    Ex-Minister Botsa Satya Narayana

    Ex-Minister Botsa Satya Narayana : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక చోట్ల అల్లర్లు జరిగాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈసీ సీరియస్ కావడంతో దాదాపు కొన్ని వందల మందిపై కేసులు నమోదు అయ్యాయి.

    ఈవీఎంలు విధ్వంసం చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈసీ కేసు నమోదు చేసింది.  అయితే  దీనిపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎనిమిది తొమ్మిది చోట్ల ఘటనలు జరిగితే కేవలం ఒక్క చోట మాత్రమే కేసు నమోదు చేయడం వెనక ఈసీకి ఉన్న కష్టం ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలకు కారణం చంద్రబాబే అని మండిపడ్డాడు.

    పల్నాడు జిల్లాలో అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిన్నింటిపై విచారణ జరగాలి. కానీ ఒక్క చోట జరిగిన దాన్ని మాత్రమే పట్టుకుని మాట్లాడటం సబబు కాదన్నాడు. విజయనగరం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని మాజీ మంత్రి బొత్స విశ్వాసం వ్యక్తం చేశాడు. రాబోయే జూన్ 4 వ తేదీన మరోసారి జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడని జోస్యం చెప్పాడు.

    అయితే టీడీపీ కూటమి చేసిన అరాచకాలను ప్రశ్నించారు.  ఎన్నికలు ముగిసిన తర్వాత విధ్వంసానికి కారణం టీడీపీ నాయకుడు చంద్రబాబు అని ఆరోపించారు. జూన్ 4 వ తేదీన వచ్చే ఫలితాలు టీడీపీకి చెంప పెట్టు లాంటివి కాబోతున్నాయన్నారు. ఇదిలా ఉండగా.. టీడీపీ కూటమి కచ్చితంగా గెలవబోతుందని కొన్ని మీడియా సంస్థల్లో డిబెట్ లలో చర్చలు కొనసాగుతున్నాయి. బొత్స నమ్మకం నిజమవుతుందా.. లేదా అనేది జూన్ 4 వ తేదీన తేలిపోనుంది. ఓంటరి పోరులో వైసీపీ గెలిస్తే మాత్రం జగన్ కు మరో అయిదేళ్లు తిరుగుండదు.

    Share post:

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    Pawan Kalyan : మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి: పవన్ కళ్యాణ్

    Deputy CM Pawan Kalyan : మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు...

    Nara Lokesh : ఉండవల్లి నివాసంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన లోకేశ్

    Nara Lokesh : మంగళగిరి ప్రజల కోసం నారా లోకేశ్ ఉండవల్లిలోని...

    Anna Canteens : తెరుచుకోనున్న అన్న క్యాంటీన్లు.. ఈ సారి రేట్లు ఇవే..!

    Anna Canteens : ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ...