Big Boss 7 :
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో లలో ‘బిగ్ బాస్’ ఒకటి. మన తెలుగులో ఇప్పటికే 6 సీజన్స్ పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి అడుగు పెట్టింది.. 7వ సీజన్ కూడా గ్రాండ్ గా స్టార్ట్ చేసి మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకు వెళ్తున్నారు.. మరి ఒక్క వారానికే ఆడియెన్స్ బిగ్ బాస్ కు అదిరిపోయే షాక్ ఇచ్చారట.. ఓటింగ్ లో అలాంటి ఫలితం రావడంతో యాజమాన్యం సైతం షాక్ అవుతుందని తెలుస్తుంది.
ఈసారి గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్ లను తీసుకు వచ్చి ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ఉల్టా ఫుల్టా అనే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు అప్పుడే చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది. ఇక ఈ సీజన్ లో మొదటి వారానికి నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మొదటి వారంలో బిగ్ బాస్ నామినేషన్స్ లో శోభా శెట్టి, షకీలా, రతికా, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, దామిని, ప్రిన్స్ యావర్ లు నామినేట్ అయ్యారు. ఈసారి సీజన్ లో ఒక్కొక్కరు ఒక్కో ఓటు మాత్రమే వేసే అవకాశం ఉంది. అయినప్పటికి ఒక్కడికే 40 శాతం ఓటింగ్ వచ్చిందట.. ఈ ట్విస్ట్ బిగ్ బాస్ కే దిమ్మతిరిగేలా చేసినట్టు తెలుస్తుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఒక్కడికే 40 శాతం ఓట్లు వచ్చినట్టు సమాచారం.. ఇది పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. ఇక ఈ వారానికి సంబంధించి దామిని, కిరణ్ రాథోడ్ లాస్ట్ స్థానాల్లో ఉండగా డేంజర్ లో వీరే ఉన్నట్టు తెలుస్తుంది.. చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో..