ఏపీ లో రాజకీయం రోజుకు రోజుకు రసవత్తరంగా మారుతుంది.. టీడీపీ, వైసీపీ మధ్య ప్రధానంగా సాగుతుంది.. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సైలెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో జోరు మీద ఉన్న చంద్రబాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు… ఈ పర్యటనలతో పాటు చంద్రబాబు తనయుడు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్రతో ముందుకు సాగుతున్నారు.
లోకేష్ పాదయాత్ర లో చిన్న ఘటనలు మినహా సాఫీగా సాగుతున్నా.. చంద్రబాబు ను వైసీపీ శ్రేణులు వెళ్లిన ప్రతి చోట అడ్డు కుంటున్నారు.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో చంద్రబాబు పర్యటన మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది.చంద్రబాబునాయుడు రోడ్ షో ను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు ఆయన కాన్వాయ్ పై రాళ్ళూ విసిరారు..
లోకేష్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఒక్క చంద్ర బాబును కట్టడి చేస్తే చాలని వైసీపీ శ్రేణులకు అధికార పార్క్ నుంచి సూచనలు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే బాబు పై పడే దాడులు జరుగుతున్నాయి..
చంద్రబాబు పై దాడులను ఎక్కువగా కవర్ చేస్తున్న మీడియా మాత్రం లోకేష్ ను లైట్ గా తీసుకుని తక్కువగా కవర్ చేస్తుంది. టీడీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య వైరం ఎలా ఉంటుందో అని ప్రజలు అనుకుంటున్నారు.