![AP Election Results](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/psefaloigist1.jpg)
AP Election Results : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, ఏపీల్లో చాలా ప్రతిష్టాత్మకంగా సాగాయి. ఈ సారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాదాపు 45 రోజుల నుంచి 50 రోజుల వరకు గ్యాప్ వచ్చింది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు గెలవాలని తీవ్రంగా శ్రమించాయి. ఓటర్లను ఎలా మచ్చిక చేసుకోవాలో తెలుసుకుని ప్రచారం చేశాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏపీలో 82 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో దేశంలో నే అందరి కళ్లు ఏపీ రిజల్ట్ పై పడింది.
అయితే వైసీపీ నేతలు సీఎంగా జగన్ విశాఖ పట్నంలో మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. కూటమే విజయం సాధిస్తుందని చంద్రబాబు నాయుడు కచ్చితంగా సీఎం అవుతాడని టీడీపీ అభిమానులు, జనసేన కార్యకర్తలు విశ్వాసంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో జాతక రీత్యా ఎవరూ సీఎం అవుతారని చాలా మంది జాతకాలు కూడా చూపించుకుంటున్నారు.
ప్రముఖ రీసెర్చ్ సంస్థ సీఎస్డీఎస్ లో సీనియర్ సెఫాలజిస్ట్ గా ప్రొఫెసర్ సంజయ్ కుమార్ పని చేస్తున్నారు. ఈయన ఏపీ ఎన్నికల గురించి ఓ టీవీ డిబేట్ షో ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో చర్చించారు. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. చాలా నియోజకవర్గాల్లో చాలా టప్ ఫైట్ నడిచింది. దాదాపు దేశంలోని అన్ని సర్వేలు కూడా టీడీపీ కి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ జూన్ 2 వ తేదీ వరకు ఇవ్వకూడదని ఈసీ రూల్స్ పెట్టాయి.
టీడీపీ గెలవబోతున్న విషయాన్ని సంజయ్ కుమార్ స్పష్టంగా వివరించారు. కానీ ఎన్ని సీట్లు వస్తాయి. ఎవరెవరూ గెలుస్తారు అనే విషయాలను మాత్రం చెప్పలేదు. అయితే ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన అల్లర్లపై ఇప్పటికే 1300 మందికి పైగా పోలీసులు కేసులు నమోదు చేశాడు. పల్నాడు జిల్లాలో తీవ్రంగా అల్లర్లు జరిగాయి. దీంతో ఈసీ సీరియస్ అయింది.