30.5 C
India
Thursday, May 2, 2024
More

    Bandar Port : ముుచ్చటగా మూడో‘సారి’ బందర్ పోర్టు

    Date:

    Bandar Port
    Bandar Port

    Bandar Port : ఏపీలో బందర్ పోర్టు పనులకు ఏపీ సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. మచిలిపట్నం ప్రజల కలగా బందర్ పోర్టును చెబుతారు. అయితే ఈ పోర్టు ఇప్పట్లో పూర్తవుతుందా.. మళ్లీ పాత కథేనా అని ప్రజల్లో చర్చ జోరుగా సాగుతున్నది..

    ఇంతకీ పాత కథ ఏంటని అనుకుంటున్నారా… అయితే చదివేయండి.. బందర్ పోర్టు పనులను ప్రారంభించడం  ఇది కొత్తేమి కాదు. ముఖ్యమంత్రులు దీనిని ప్రారంభించడం ఇది మూడో సారి. మొదటి సారిగా 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కరగ్రహరంలో శిలాఫలకం ఆవిష్కరించి బందర్ పోర్టు పనులను ప్రారంభించారు. కాని పనులు ముందుకు సాగలేదు. ఆ 2013లో బందర్ లో ఒక సభలో పాల్గొన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బందర్ పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కాని దానిని పట్టించుకోలేదు. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ పేర్నినాని ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా కొబ్బరికాయ కొట్టారు. తన పార్టీ ఎంపీకి చెందిన నవయుగ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారు. ఈ సమయంలో ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆ తర్వాత ఏపీ లో వైసీపీ అధికారంలోకి రావడం జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. పనులు జాప్యం చేస్తున్నారనే కారణం చూపి నవయుగ కాంట్రాక్ట్ ను సీఎం జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక పనులు ఆగిపోయాయి. తాజాగా జగన్ మరోసారి ఎన్నికలకు ఏడాది ముందు బందర్ పోర్టు పనులకు సోమవారం మరోసారి ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా పేర్ని నాని ఉన్నారు.

     తాము అధికారంలోకి వచ్చాక కరోనా విపత్తు కారణంగా రెండేళ్లు జాప్యం జరిగిందని వైసీపీ చెబుతున్నది. పర్యావరణ అనుమతులకు సంబంధించి కూడా కొంత ఆలస్యమైందని చెబుతోంది. 2024లో మళ్లీ ప్రభుత్వం మారితే కథ మొదటి నుంచి మొదలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే ఇప్పుడైనా మచిలీపట్నం వాసుల కల నెరవేరుతుందా.. లేదా వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Viral Video : ‘‘రెండో సారి సీఎం కావాలంటే మూడో శవం కావాలే..’’ ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

    Viral Video : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి....

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...