40.1 C
India
Friday, May 3, 2024
More

    భారత్ వైపే వాళ్ల చూపు అంటున్న మోదీ.. ఎవరంటే..

    Date:

    Modi says
    Modi says

    మూడు దేశాల పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ కాసేపటి క్రితం భారత్ కు చేరుకున్నారు. జపాన్, పూనువా నూగినియా, అస్ర్టేలియా దేశాల పర్యటనను ముగించుకొని ఆయన స్వదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ శ్రేణులు ఆయనకు అభినందన సభను ఏర్పాటు చేశాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    అయితే ప్రధాని మోదీ మాట్లాడుతూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిపారు. ఆస్ర్టేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించానని, ఈ అంశాన్ని ఆదేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. భారతీయ సంస్కృతిని తెలిపే ఆలయాలపై దాడులను ప్రధాని ముందే ఖండించానని తెలిపారు. మన దేశం యావత్ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్లు అందించిందని గుర్తు చేశారు. అందుకే మనదేశం వైపే ప్రపంచ దేశాల చూపు ఉందని చెప్పుకొచ్చారు. భారత్ గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ లాంటి శాంతికాముకులు పుట్టిన నేల అని తెలిపారు. సిడ్నీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ దేశ పార్లమెంట్ సభ్యులంతా తరలిరావడం గొప్పగా అనిపించిందని, అది మనదేశ గొప్పతనమని తెలిపారు. .

    కార్యక్రమంలో భాగంగా జేపీ నడ్డా, సుబ్రహ్మణ్య జైశంకర్ మాట్లాడుతూ పవూవా న్యూగినియా ప్రధాని మన దేశ ప్రధాని మోదీకి పాదనమస్కారం చేయడం మన దేశానికి దక్కిన గొప్ప గౌరవమని తెలిపారు. మోదీని అంతా విశ్వ గురువుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. అస్ర్టేలియా ప్రధాని కూడా స్వయంగామోదీని ది బాస్ అని సంబోధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

    Share post:

    More like this
    Related

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    PM Modi : పండ్ల వ్యాపారిని కలిసిన మోదీ

    PM Modi : ఎన్నికల ప్రచారంలో  భాగంగా ప్రధానమంత్రి మోదీ తాజాగా...