![YCP Another Mistake](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/1200-675-21760458-thumbnail-16x9-jagan.jpg)
YCP Another Mistake : రాజకీయాల్లో గెలుపు, ఓటములు సర్వ సాధారణం. గెలిస్తేనే సేవ చేస్తాం. అది కూడా సీఎం, మంత్రుల లాంటి పదవులు ఉంటే తప్ప సేవ చేయం అనడం మంచిది కాదు. వైసీపీ తీరు ప్రస్తుతం అలాగే కనిపిస్తుందని ఏపీ ప్రజలు వాపోతున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీ సమావేశాలకు రాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. నిన్న (జూన్ 21) ఏదో వచ్చాం అంటే వచ్చాం.. అంటూ వచ్చిన జగన్ ఈ రోజు (జూన్ 22) స్పీకర్ ను ఉద్దేశించి సభా కార్యక్రమం ఉంది. స్పీకర్ను సభాపతి స్థానంలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత పాలక పక్షానికి ఎంతో ప్రతిపక్షానికి కూడా అంతే. 11 సీట్లు వచ్చినా, వైసీపీ ప్రతిపక్షం కాబట్టి ఆ పార్టీ తన బాధ్యతను నిర్వర్తించాలి. కానీ జనగ్, 10 ఎమ్మెల్యేలు సభకు రాలేదు. దీంతో బాధ్యతల నుంచి పార్టీ పారిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
‘అయ్యన్న’కు అవమానం..
అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు నిన్న (జూన్ 21) నామినేషన్ వేశారు. అత్యధికంగా 8 సార్లు ఎమ్మెల్యే, ఒక సారి మంత్రిగా, మరో సారి పార్లమెంట్ కు ఎన్నికైన అయ్యన్న పాత్రుడిని స్పీకర్ పదవికి చంద్రబాబు ఎంపిక చేశారు. ఈ పదవికి ఒక్క నామినేషనే రావడంతో ఏకగ్రీవమైంది. ఇవాళ ఆయనను గౌరవంగా సభాపతి సీటులో కూర్చోబెడతారు. సంప్రదాయం ప్రకారం.. ఈ పని ప్రతిపక్షమే చేయాలి. ఎందుకంటే.. స్పీకర్ సహజంగానే అధికార పార్టీకి చెందిన వ్యక్తి. అయితే, ఆయన పాత్ర మాత్రం రాగద్వేశాలకు అతీతంగా పాలక పక్షం, ప్రతిపక్షాన్ని సమానంగా చూస్తారు కాబట్టి. స్పీకర్కు ఆ గౌరవం ఇస్తూ ప్రతిపక్షం ఈ సంప్రదాయం పాటిస్తుంది. కానీ వైసీపీ దానికి మంగళం పాడింది. దీన్ని బట్టి చూస్తే ముందు ముందు ఆ పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. స్పీకర్నే గౌరవించని వైసీపీ.. సభలో బాధ్యతగా ఎలా వ్యవహరిస్తుందా? అనే డౌట్ రాజకీయ వర్గాల్లో వస్తోంది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే జగన్ తనకేమీ పట్టనట్టు పులివెందులకు వెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న సమయంలోనే ప్రజల తరఫున ప్రతిపక్షంగా జగన్ ప్రశ్నించాలి. ఈ బాధ్యతను మరచి పులివెందులకు వెళ్లాలనుకోవడం సబబు కాదనే వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వెళ్లచ్చుగా అని టీడీపీ నిలదీస్తుంది. ఎన్నికలకు ముందు ఎన్ని రాజకయాలైనా చేయవచ్చు గాక.. కానీ అన్నీ ముగిశాక ప్రజల కోసం పని చేయాలి. అదే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. ఇలా పంతాలకు పోయి బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు.