![Nagarjuna](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/Capture.jpg)
Nagarjuna : సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ ఎంతో గౌరవం, అభిమానం. ఆయన రచనలు, రాసిన పాటలు అజరామరం. సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే హిరో నాగార్జున కు కూడా చాలా ఇష్టమట. ఆయన నేనున్నాను సినిమాలో రాసిన ఈ శ్వాసలో చేరితే అనే పాటతోనే సినిమా హిట్ అయిందని చెప్పొచ్చు.
సిరివెన్నెల గురించి నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సిరివెన్నెల రాసిన పాటలో ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా.. అంటూ రాసిన పాట అద్భుతం. ముఖ్యంగా ఈ పాట ఎంతో ఇన్స్ఫిరేషన్ . ఎవరైనా తండ్రి తన కొడుకుకు ఏం చెప్పాలనుకుంటాడో ఆ పాటలో మొత్తం చెప్పేశాడు. సీతారాముల కల్యాణం సినిమాకు సంబంధించి నిర్మాత వ్యవహరించినపుడు సిరివెన్నెల తో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందని నాగార్జున అన్నారు. ఆ సమయంలో ఎక్కువ సేపు ఆయనతో మాట్లాడే సమయం వచ్చిందన్నారు. దీంతో చాలా విషయాలు నేర్చుకున్నామన్నారు.
నాగార్జున సినిమాల్లో సిరివెన్నెల రాసిన పాటలు ఎక్కువగా ఉంటాయని అంటుంటారు. అది నిజమే ఎందుకంటే అది కావాలని చేసిందేమీ కాదు.. కానీ ఆయన రాస్తే బాగుండని అనుకుంటున్నాను. అది అలా కలిసి వచ్చిందని నాగార్జున చెప్పారు. శ్రీ సీతారాముల కల్యాణం సినిమాలో సిరివెన్నెల ఒక్క పాటలోనే రామాయణం మొత్తం రాశారు. ఇలా రాయడం ఆయన వల్లే సాధ్యమవుతుంది. కొన్ని సినిమాల్లో ఆయన రాసిన పాటలు నాకు అర్థం కాకపోతే ఇది మార్చితే బాగుండని, లేకపోతే ఇది ఏంటో వివరంగా చెప్పాలని అడిగేవాడినని అన్నారు.
సిరివెన్నెల అద్భుతమైన మనిషి. ఆయన పాటలు విన్నాక ఇలాంటి ఆలోచన శక్తి మనకెందుకు లేదని అనిపిస్తుంది. మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోతున్నామని అప్పుడప్పుడూ అనిపించినా.. ఆ ఆలోచన శక్తి, తెలుగు పై పటుత్వం, అలతి పదాలతో అద్వితీయమైన వార్తల్ని రాయడం ఆయనకే సాధ్యం. ఆయన తెలుగు వారి నేస్తం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.