![Software Employee](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-3-10.jpg)
Software Employee : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని స్నేహితులకు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్ఐ మల్లికార్జున సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం.. తవణంపల్లె మండలం ఎ.గొల్లపల్లెకు చెందిన బాలాజీ (30) ఢిల్లీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతడు ప్రస్తుతం ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు.
శనివారం తిరుమల వెళ్లి తెచ్చిన ప్రసాదం బంగారుపాళ్యంలోని స్నేహితులకు ఆదివారం రాత్రి ఇచ్చి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా బంగారుపాళ్యం-అరగొండ మధ్యలో వంకమిట్ట వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పరీక్ష నిర్వహించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.