Viveka murder case : మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, మాజీ ఎంపీ వివేకా హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా అనేక కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ సమయంలోనూ కోర్టులో అనేక వాదోపవాదాలు.. కీలక మలుపులు తిరిగిన సంగతి తెల్సిందే.
ఈక్రమంలోనే భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్పై రేపు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. భాస్కర్రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈనెల 5న సిఐబీ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో వైఎస్ అవినాష్రెడ్డిని 8వ నిందితుడిగా సిబీఐ పేర్కొనడం గమనార్హం. కుట్ర.. సాక్ష్యాధారాల చెరిపి వేతలో అవినాష్ రెడ్డి.. భాస్కర్రెడ్డి ప్రమేయం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే రేపు సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ReplyForward
|