మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వ తేదీ లోపు దర్యాప్తు మొత్తం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సీబీఐ విచారణ అధికారి రాంసింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని , విచారణ ఆలస్యం జరుగుతోందని భావించి అతడ్ని తొలగించింది. అతడి స్థానంలో చౌరాస్యను నియమించింది. ఏప్రిల్ 30 వ తేదీ లోపు విచారణ పూర్తి కాకపోతే 5 వ నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.
2019 ఎన్నికలకు ముందు మార్చిలో మాజీ వైఎస్ వివేకానంద రెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మొదట్లో గుండెపోటుతో మరణించారని అన్నారు. కట్ చేస్తే దారుణ హత్య అని తేలడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈలోగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం పోయి జగన్ ప్రభుత్వం ఏర్పడింది. దాంతో వివేకా కూతురు డాక్టర్ సునీత సీబీఐ ని ఆశ్రయించింది. తాజాగా సుప్రీంకోర్టు ఏప్రిల్ 30 వ తేదీగా డెడ్ లైన్ విధించింది. అంటే నెల రోజులు అన్నమాట.