దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపిలో అధికారులు అప్రమత్తంగా ఉండాని సీయం జగన్ అధికారులను ఆదేశించారు. కోత్త వేరియంట్ జేఎన్-1 విస్తరిస్తుంది అన్న మాచారంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోర్యశాఖ అధికారులతో సీయం సమీక్షనిర్వహించారు. వైరస్ వ్యాప్తిపట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆధేశించారు..ఏపిలో గత 24 గంటల్లో 3 కరోన కేసులు నమోదు అయినట్లు అధికారులు సమీక్ష లో సీయం కు తెలిపారు. అయితే ఈ కేసులు కోత్త కోవిడ్ వేరియంట్ సంబందిచినవా లేక పాత కేసులేనా అన్నది ఇంకా నిర్థారణకు రాలేదు. రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో ర్యాపిడ్ కిట్ల తో పాటు మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.