హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో తొలి కరోనా కేసు నమోదు అయింది. నాంపల్లి ఆగాపురకు చెందిన 14నెలల బాలుడు గత కోద్ది రోజుల నుండి జ్వరం, నిమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. బాలుడికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉంద ని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. తెలంగాణలో దాదాపు 20 యాక్టివ్ కేసులు ఉండగా ఒక్క హైదరాబాద్లోనే 14 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 56 కేసులు నమోదు కాగా 4 కేసులు పైదరాబాద్ నగరంలో నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తితో మాస్క్ లేనిదే ఆస్పత్రుల్లోకి రాకూడదంటూ నిబందనలు కఠినతరం చేశారు. కరోనా సమస్య తోలగిపో యింది ఇక హాయిగా ఉండవచ్చు అనుకున్న సమయానికి ప్రస్తుతం మళ్లీ కరోనా వేరియెంట్ విస్తరిస్తుండటంతో తెలంగాణ ప్రజలు ఆంధోళన చెందుతున్నారు.