అయోధ్య: సామాన్య భక్తులకు రేపటి నుంచి బాలరాముడి దర్శనం లబించనుంది. ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు,మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటలకు వరకు దర్శనం ఉంటుంది. నేడు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ఎంతో ఆర్బాటంగా ప్రారంభం అయింది. ఎప్పటి నుంచో అయోధ్య రాముడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తుల కోరిక నెరవేరింది. ఎప్పుడెప్పుుడు స్వామి వారిని దర్శించుకోవాలని భక్తులు ఎదురు చూస్తున్నారు..ఇప్పటికే కోన్ని వేల మంది భక్తులు ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు కూడా చేయించుకున్నారు. రేపటి నుంచి భక్తులు తాకిడితో అయోద్య రామాలయం కిటకిటలాడుతుంది. రామ్ లల్లాను దర్శించుకోని పుణీతులు కావాలని భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు.
అయోధ్య: 500 ఏళ్ల కల నెరవేరిందని అన్ని దారులూ రామ మందిరం వైపే చూపిస్తున్నాయని యూపీ సిఎం యోగి ఆధిత్యనాథ్ తెలిపారు… మనం త్రేతాయుగంలోకి వచ్చినట్లుందని ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా ఎదురుచూశాం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడంతో యావత్ భారతదేశమే అయోధ్యధామంగా మారిందన్నారు. 1990లో కరసే వకులపై జరిగిన కాల్పులను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇకపై అయోధ్యలో కర్ఫ్యూలు, కాల్పులు జరగ వన్నారు. అయోధ్యలో రామాలయం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన చెప్పారు.