Holi celebrations in Ayodhya : కొన్ని వేల సంఖ్యలో తరలివచ్చిన జనం హోలీ తొలి పండుగ కావడంతో అయోధ్య నగరం మొత్తం రంగులమయం అయింది.
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలిసారిగా హోలీ వేడుకలు ఘనంగా జరుగు తు న్నాయి. ఆదివారం ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ రామ్ లల్లా కు ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే..
హోలీ తొలి పండుగ కావడంతో అయోధ్య నగరం మొత్తం రంగులమయం అయింది. శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్రం రామ్ లల్ల విగ్రహం మరియు రామాలయంలోని భక్తుల చిత్రాన్ని సోషల్ మీడి యాలో పోస్ట్ చేసింది. రామ్ లల్లా విగ్రహానికి గులాల్ పూశారు.
భక్తులు స్వామివారికి ధూపదీపాలను సమర్పించే పవిత్రమైన రోజు కావడంతో శ్రీరాముని దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చారు.మార్చి 24, 25 తేదీలలో దేశవ్యాప్తంగా ప్రజల హోలీని జరుపుకుంటారు.