Ravela Kishore Babu : మాజీమంత్రి రావెల కిశోర్ బాబు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు కండువా కప్పిన సీఎం జగన్.. పార్టీలోకి ఆహ్వానించారు. రావెల కిశోర్ బాబు.. ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. అనంతరం వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా, రావెల కిశోర్ బాబును ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ గా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ గా బాలసాని కిరణ్ కుమార్ ఉన్నారు. అయితే, బాలసాని కిరణ్ కుమార్ పట్ల వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. దీంతో అక్కడ బాలసాని కిరణ్ ను తప్పించి ఆయన స్థానంలో రావెల్ కిశోర్ బాబును ప్రత్తిపాడు ఇంఛార్జ్ గా నియమించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
టీడీపీ హయాంలోనూ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచే రావెల కిశోర్ బాబు ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత ఆయన జనసేనలో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం వైసీపీలో జాయిన్ అయ్యారు. ప్రత్తిపాడు ఇంఛార్జిగా రావెలను నియమించే ఆలోచన వైసీపీ అధినాయకత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేకతోటి సుచరితను తాటికొండను మార్చారు.