ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో యంపిగా పోటీచేస్తే నేను ఆయన పై పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిస్తానని ప్రశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్కు పోటీ చేస్తారని అంటున్నారని ఆయన ఎక్కడ పోటీ చేసినా నేను ఆయన పై పోటీ చేయడం కాయం అని పాల్ అన్నారు. తెలుగు వారి సత్తా చూపించేందుకు మోడీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు నేను పోటీ చేస్తానని తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు నాది గ్యారెంటీ అని పాల్ తెలిపారు. నాలాంటి వాడికి పార్లమెంట్కు వెళ్లే అవకాశం ఇవ్వాలి తెలంగాణ ప్రజలు ఇవ్వాలని నేను తప్ప ఎవరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చలేరని పాల్ అన్నారు.
Breaking News