ప్రజల కష్టాలను వారికి జరగాల్సిన న్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించి నందుకు ఓక మహిళ జీవితాన్ని అక్కడి పాలకులు నాశనం చేశారు. ఇబ్బంది పడింది ఓక సాధారణ మహిళ కాదు. గుంటూరు జిల్లాలో ఫేమస్ హోటల్ శంకర్ విలాస్ అధినేత్రి రంగనాయకి.
రంగనాయకి 2016 లో తన భర్తను కోల్పోయిన ఈ మహిళ తన ఈ హోటల్ ను నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎల్జీ పాలిమర్స్ అంశంలో బాధితులకు న్యాయం చేయాలని ఆమె సోషల్ మీడియాలో ఓక పోస్ట్ పెట్టారు. పోస్టు పెట్టిన మరుసటి రోజు నంచి ఈమెకు వేధింపులు మొదలయ్యాయి. పోలీసులు ఆమెను విచారణకు పిలిపించి నానా ప్రశ్నలు వేస్తూ ఇబ్బందులకు గురిచేెశారు. అంతటితో వదిలేయకుండా ఉన్న హోటల్ ను కూడా కొందరు మంది వైసిపి నేతల లాక్కున్నారు.
పోతే పోనీ అని తన స్నేహితురాళ్ల సహాయంతో మరో చిన్న హోటల్ పెట్టుకున్నా అక్కడ కూడా ఇబ్బంది పెట్టి చివరకు ఊరు విడచివెళ్లేలా చేశారు. దీంతో ఆ మహిళ కుటుంబం వీధిన పడింది. భర్త లేడు ఉన్న పిల్లలను చదివిస్తూ అష్టకష్టాలు పడుతోంది. ఆ క్రమంలో తన ఆర్థికస్థితిపై దెబ్బవేశారని.. అక్కడ ఉండలేక హైదరాబాద్ కు వచ్చానని ఆ మహిళ వాపోయింది. దీన్ని బట్టి ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం అవుతున్నాయి. ఆమె కు జరిగిన అన్యాయాన్ని ఈ క్రింది వీడియోలో వినండి..