ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్య క్షు రాలుగా రంగంలోకి దిగి అన్న పైన పోరాటం చేస్తున్న, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను టార్గె ట్ చేస్తున్న వైయస్ షర్మిల విషయంలో ప్రత్యర్థి పార్టీల నేతల నుండి కూడా సానుభూతి వ్యక్తం అవుతుం ది. జగన్ ను దీటుగా ఎదుర్కొంటున్న వైయస్ షర్మిలకు బాసటగా పలువురి గొంతు ప్రస్తుతం వినిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు షర్మిల కు ప్రాణహాని ఉందంటూ, ఆమెకు భద్రత పెంచాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మి లకు భద్రత పెంచాలని, ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి, బాబాయ్ అని తేడా ఏమీ లేదని ఆరోపించారు.
రాజకీయంగా ఆమెని ఎదుర్కోలేక అంతమొందించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన అయ్యన్నపాత్రుడు షర్మిలకు వైఎస్ఆర్ ఇచ్చిన ఆస్తులలో వాటాను పంచకుండా జగన్ ఆపుతున్నారన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ప్రియమైనది కూతురు షర్మిల అన్న విషయం ఆయన సన్నిహితులు అందరికీ తెలుసనీ, అందుకే ఆమెకు ఆస్తిలో ప్రత్యేకంగా వాటా రాశారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆ ఆస్తిని షర్మిలకు ఇవ్వకుండా జగన్ అడ్డుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.