బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె నారాయణ స్పందించారు. బిగ్ బాస్ షో ని ముందుండి నడిపిస్తున్న ఆర్గనైజర్స్ ని కూడా బాద్యులను చేస్తూ వారిపై కూడా కేసు నమోదు చేయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. రియాలిటి షో ల పేరుతో 100 రోజులకు పైగా అందరిని ఓకే చోట నిర్బందించి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయ్యాలని ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతను చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. బిగ్ బాస్ మెదలు అయినప్పటి నుంచి అన్నీ పక్కన పెట్టి యువత ఈ షోను చూస్తున్నారన్నారు. సమాజానికి ఉఫయోగడని ఇలాంటి కార్యక్రమాలు ఇక మీదట నిర్వహించకుండా రాష్ట్రప్రభుత్వం చూడాలని ఆయన తెలిపారు. లోపల ఉండాల్సిన వారు బయట, బయటవుందాల్సిన వారు లోపలా? ధనం మూలం ఇదం జగత్ అని నారాయణ అన్నారు.