వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటుగా లోకసభ ఎన్నికలకు ఫిబ్రవరి 24న నోటిఫికేషన్
ఇవ్వనన్నట్లు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ నోటిఫికేషన్ ను నెలరోజు ల ముందుగా ఇవ్వనన్నట్లు తెలుసోంది. వేసవి కాలంలో విద్యుత్ కోత మరియు మంచినీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున సార్వత్రిక ఎన్నికలకు ఒక నెల ముందు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తం అవుతుందని తెలుస్తుంది.
ఈ నెలాఖరులుగా దేశంలో ఎన్నికల ఓట్ల జాబితా కరారు చేయనున్నట్లు చేసినట్లు సమాచారం అందుతుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఇద్దరు అధికారులు నేడు రేపు ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు గురించి సమీక్ష నిర్వహించేందుకు రానున్నారు. పరిణామాలన్నీ పరిశీలిస్తే ఎన్నికల సంఘం ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు రేపు రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఎన్నికల అధికారులతో సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మార్చి నెలాఖరులో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేటట్లు ఎన్నికల సంఘం సమాయత్త మవుతుంది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం నెలరోజులు ముందు ఎన్నికల కెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.ఏపీ ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందుగా వెళ్లే అవకాశాలు ఉన్నందున మార్చిలోనే పదో తరగతి ఇంటర్ పరీక్షలు పూర్తి చేసేందుకు షెడ్యూల్ ప్రకటించింది. నూటికి నూరు శాతం సార్వత్రిక ఎన్నికలు మార్చి నెలాఖరులోగా జరిగే అవకాశాలు సంపూర్ణంగా కనిపిస్తున్నాయి.