Elections Notification : దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఈరోజు 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంటు నియోజకవర్గం నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.
ఈనెల 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 30వ తేదీన ఉపసంహరణకు తదిగడవు ఉంటుంది. వచ్చేనెల 19 తేదీన పోలింగ్ జరగనుంది. అత్యధికంగా త మిళనాడులో ఒకే విడతలు 39 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. 22 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేం దుకు సిద్ధమవుతున్నారు. 102 పార్లమెంటు నియోజక వర్గాలకు ఈ నోటిఫికేషన్ రానుంది.