ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు.. అందులో తప్పుందని మనం చెబితే వారు ఏం చేస్తారు.. కొందరైతే తప్పును సరిదిద్దుతారు. మరికొందరైతే ఏ.. తప్పే జరగలేదని బుకాయిస్తారు. ఇంకొందరైతే దా నువ్వు చేయి.. పని చేస్తే తెలుస్తుంది నీకు అని అంటారు. కానీ ఓ కంపెనీ మాత్రం తప్పును ఎత్తి చూపినందకు ఏకంగా కోటి రూపాయలు ఇచ్చింది. అదేదో చిన్న కంపెనీ కాదు.. ప్రపంచంలోనే పేరు మోసిన కంపెనీ గూగుల్.
కేరళలోని తిరువనంతపురం జిల్లా నేడుమంగడకు చెందిన ఓ పారిశ్రామికవేత్త శ్రీరామ్ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి రూ. ఒకటి పాయింట్ 1.11 కోట్ల భారీ బహుమతి అందుకున్నా రు. గూగుల్ సేవలలో లోపాలను ప్రచారం చేసే వల్నారబిలిటి రివార్డ్ ప్రోగ్రాం 2022లో కేఎల్ శ్రీరామ్ రెండు, మూడు ,నాలుగవ, స్థానాలను గెలుచుకున్నారు. శ్రీరామ్ గూగుల్ భద్రత లోపాలను కనుగొన్నట్లు కంపెనీ తెలిపింది. దీనికి గాను 1,35,979 డాలర్లను బహుమతిగా ఇచ్చింది.